మిషన్ కాకతీయ పనులు పండుగలా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర సాస్కృతిక సారథి చైర్మిన్ ఏమ్మేల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలో ని ఊటూర్ , రంగపేట , కేల్లేడ గ్రామాల్లోని చెరువుల్లో మంగళవారం సాయంత్రం పూడికతీత పనులను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణ తోనే గ్రామాలు అబివృద్ది చెండుతాయనే సి ఎం కేసిఆర్ ఈ కార్యక్రమాని చేపట్టారన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సీమాంద్ర పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణా ప్రబుత్వం హయంలో పూర్వ వైబవం సంతరించుకోనున్నాయని వివరించారు. కాంట్రాక్టర్లు నిబందనల మేరకు పనులు నిర్వహించని నాణ్యత పాటించని వారికి బిల్లులు రద్దు చేసి వేరే వారికి పనులు అప్పగిస్తామని ఆయన హెచ్చరించారు.రూ. కోటి 74 లక్షలతో ఊటూరు నుంచి వెగురుపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఊటూరు ను అబివృద్ధి లో అగ్రగ్గమిగా నిలుపుతానని గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు
గత ప్రబుత్వ పాలనలో విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఒక్క నిమిషం కూడా సమస్య తలెత్తకుండా సిఎం ఇంతో కృషి చేశారని వెల్లడించారు. రైతు శ్రేయస్సు కోసం వచ్చే మార్చి నుంచి 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో సర్పంచులు గోపు శ్రీనివాస్ రెడ్డి, రుద్రారం శ్రీనివాస్, బత్తిని బూమయ్య గౌడ్, మోద్దసాని శ్రీధర్ రెడ్డి, ఏరు కొండ స్వప్న, సాయవేని సదానందం, ఎం పి టి సి లు ఉషాకోయిల విజయ, కోలా లక్ష్మి, తహసిల్దార్ విద్యాదరచారి, ఆర్ ఐ భగవంతరావు, ఎం పీ పీ మాతంగి లింగయ్య, జడ్పీ సబ్యుడు ఎడ్ల సుగుణాకర్, వైస్ ఎం పీ పీ దేవా సతీష్ రెడ్డి, టీ ఆర్ ఎస్ రాష్ట్ర కమిటి సబ్యుడు జీ వి రామకృష్ణ రావు , మండల అద్యక్షుడు నూతి శ్రీనివాస్, నాయకులు మాడ తిరుపతిరెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి , ఎదుల విజయబాస్కర్ రెడ్డి, ఏనాగందుల సుదర్శన్, ఉషాకోయిల లక్ష్మణ్ , రేమిడి శ్రీనివాస్ రెడ్డి, కొత్త రవీందర్ రెడ్డి, రామిదడి శంకర్ రెడ్డి, గుర్రం కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Ref : http://namasthetelangaana.com 06/05/2015
Comments
Post a Comment