Skip to main content

మా సొంతూరు అంటే రెండూళ్ల గురించి చెప్పాలి


మా సొంతూరు అంటే రెండూళ్ల గురించి చెప్పాలి. మొదటిది కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరు అనే గ్రామం. మా తాతముత్తాతలదా ఊరే. మా నాన్న (జనార్దనరెడ్డి) వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు. అంతమందిలో పంచుకున్నప్పుడు తగినంత భూవసతి ఏర్పడలేదాయనకు. అందువల్ల గంగ (గోదావరి) దాటి వచ్చి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఫారెస్టు కంట్రాక్టర్ల దగ్గర గుమస్తాగా చేరారు.ముగ్గురు అక్కయ్యలు, నేను, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు వెరసి ఏడుగురు పిల్లలం మేం. మా పెదనాన్న, మేనత్త - ఊటూరులోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అందువల్ల నాకు పదేళ్ల వయసు వచ్చేవరకూ ప్రతి పండగకూ సెలవులకూ ఊటూరెళ్లిపోయేవాళ్లం. అది సంప్రదాయకమైన పల్లెటూరు. కుల వ్యవస్థ, మతాచారాలు, ఆర్థిక తారతమ్యాలు అన్నీ బలంగా ఉండేవి అక్కడ. స్పష్టంగా బైటికి తెలిసేవి కూడా. ఊటూరు - జోగాపురం మధ్యన సుమారు వంద కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. తేడాలు మాత్రం చాలా ఎక్కువ. అంత చిన్న వయసులోనూ మాకు స్పష్టంగా తెలిసేవి. మా ఊరితో పోల్చినప్పుడు ఊటూరు మనుషుల్లో వ్యవసాయంలో, వ్యవహారంలో ఆధునికత కనిపించేది. అక్కడ వైష్ణవం ఎక్కువ. గురువులు వచ్చి సందేశాలిచ్చేవారు. వాళ్లు మడిగా వంటచేసుకుంటుంటే మాకు వింతగా అనిపించేది. పూజలు చేశాక మా పెదనాన్న, మేనత్త మమ్మల్ని ఆ గురువుల కాళ్లకు మొక్కమనేవారు. మాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మా ఊళ్లో మాకు గురువులు లేరు, కులమత భేదాల్లేవు. ఇక్కడవన్నీ ఎందుకున్నాయో మాకు అర్థమయేది కాదు. వైష్ణవాన్ని స్వీకరించిన మా మేనత్త శివాలయానికి వచ్చేదికాదు. అక్కడి ప్రసాదం ఇస్తే తినేది కాదు. 'ఎవరైనా దేవుడే కదా. దేవుడికి మొక్కమని చెప్పింది నువ్వే కదా' అని మేం అడిగితే ఏదో చెప్పి తప్పించుకునేది. ఊటూరు మానేరు ఒడ్డున ఉంటుంది. వర్షాకాలంలో దాన్ని దాటడం కష్టంగా ఉండేది.

www.utoorvillage.com
__________________________________________________

Comments

Popular posts from this blog

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు  అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు.. హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరి...

పరామర్శ

ఆదరణ లేక.. అంతరిస్తోన్న చేనేత - ఊటూర్‌

నెలలో 15 రోజులే పని ప్రభుత్వ, ఆప్కో బకాయిలు రూ. 9 కోట్లు సంఘాల్లో నిల్వలు రూ. 4కోట్లు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు  చేనేత పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం, ఆప్కో బాకాయిలు చెల్లించకపోవడం, ఉత్పత్తి వస్త్రాలను ఎప్పడికప్పుడు కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాలోని సహకార సంఘాల్లోని ఆరువేల చేనేత కార్మికుల జీవనం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.200 కోట్లు కేటాచించింది. కార్మికులకు మాత్రం పైసా విడుదల చేయలేదు. సంఘాల ప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.ఒకవైపు పనులు లేక, మరోకవైపు ప్రత్యామ్నాయ ఉపాధి లేక నేతన్నలు ఆందోళనలో ఉన్నారు. నవతెలంగాణ - కరీంనగర్‌ టౌన్‌ ఇవీ చేనేత సంఘాలు.. చేనేత రంగంలో రాష్ట్రంలోనే జిల్లాలో ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలో 34 చేనేత సహకార సంఘాలున్నాయి. జిల్లా కేంద్రంలో ఆదర్శ -1, ఆదర్శ-2, కరీంనగర్‌ చేనేత సహకార సంఘం, మండంలోని బొమ్మకల్‌, హెచ్‌డబ్లూసిహెచ్‌ కొత్తపల్లి, మార్కండేయ, జగిత్యాల, వేములవాడ, హన్మాజిపేట, మామిడిపల్లి, హుజురాబాద్‌, బాపూజీ( హుజురాబాద్‌), ఆముదాల పల్లి (శంకరపట్న...