ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్రపటాన్ని దేశ అభివృద్ధి రూపురేఖలను మార్చగల ఒక బలమైన యుధం ఓటు. కావున ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండ వినియోగించు కోవాలి . గ్రామాలలో కంటే పట్టణాలలో నే తక్కువ గా పోలింగ్ నమోదు అవుతుంది విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు అంటే చదువుకున్న వారే ఓటు హక్కు ని వినియోగించుకోవడం లేదు. 100 కి 200 కి రైస్ కుకర్ ల కి ఎంతో విలువైన ఓటు ని అమ్ముకోకండి. ఓటు హక్కు మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు.
నచ్చకపోతే నోటా
ఎన్నికల బరిలో నేరచరితులు, ధనస్వాములు, కులస్వాములు.. కండబలాఢ్యులే ఉంటే? వీళ్లెవరూ నచ్చకపోయినా ఓటెయ్యక తప్పనిసరి పరిస్థితి. ఇది మొన్నటి వరకు ఉన్న ఎన్నికల వ్యవస్థ. కానీ ఈ దఫా ఎన్నికల్లో నేరస్వామ్యంపై నిరసనాస్ర్తాన్ని సంధించేందుకు సరికొత్త అస్త్రం వచ్చేసింది. అదే నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్) అనే ఆప్షన్ను ఎన్నికల కమిషన్ ప్రవేశపెడుతున్నది.
- అభ్యర్థులను తిరస్కరించొచ్చు
- గెలుపోటముల మధ్య ఈ ఓట్ల లెక్కే కీలకం
- ఒక్క ఓటుతోనూ ఫలితాల్లో మార్పు
- గతేడాది నాలుగు రాష్ర్టాల్లో స్వల్ప స్పందన
- గెలిచిన వారి ఆధిక్యాలపై ప్రభావం
- కొందరి ఆధిక్యం కంటే నోటా ఓట్లే అధికం
-నోటాకూ గుర్తు కేటాయింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న హైకోర్టు
* * * * www.utoorvillage.com * * * *
Comments
Post a Comment